భర్త చనిపోయాడనుకుని ఆత్మహత్య చేసుకుంది.. కానీ చివరికి?

praveen
మనిషి జీవితంలో ఉండే అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్ని బంధాలు విడిపోయినా అటు భార్యాభర్తల బంధం మాత్రం కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలను చూపించుకుంటూ ఇక కలిసి మెలిసి ఉంటారు. ఇక అందుకే భార్యాభర్తల బంధం లో ఏర్పడే ప్రేమ అనురాగం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. కానీ అక్కడక్కడ ఇంకా ఇక భార్యాభర్తల బంధానికి విలువ ఇస్తూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతుకుతున్న భార్యాభర్తలు కనిపిస్తూనే ఉన్నారు.

 ఏకంగా కట్టుకున్న వారు చనిపోతే ఇక మిగతా జీవితాన్ని ఊహించుకోలేక చివరికి వారితో పాటే ప్రాణాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు.  చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఏకంగా భర్త మరణం వార్త విన్న భార్య ఇక భర్త లేని జీవితం నాకెందుకు అనుకుంది. దీంతో చివరికి ఆత్మహత్య చేసుకుని తనవు చాలించింది. కానీ ఆ తర్వాతే భర్త చనిపోయాడు అన్నది తప్పుడు వార్త అన్న విషయం అందరికీ తెలిసింది. భువనేశ్వర్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 హైటెక్ ఆసుపత్రిలో డిసెంబర్ 29వ తేదీన ఏసీ పేలిన ఘటనలో దిలీప్, జ్యోతిరంజన్ ఆసుపత్రిలో చేరారు. అయితే మరునాడు జ్యోతిరంజన్ చనిపోయాడు. ముఖం కాలిపోవడంతో సిబ్బంది అది దిలీప్ మృతదేహం అనుకుని కుటుంబీకులకు అప్పగించారు. అయితే ఈ విషయం తెలిసిన దిలీప్ భార్య సోనా ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈనెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆ తర్వాతే తెలిసింది దిలీప్ చనిపోలేదని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని.. ఈ విషయం తెలిసి ఇక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: