ఎలుక పై పగ పెంచుకున్న యువతీ.. చివరికి ఏం చేసిందంటే?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అన్ని విషయాలను కూడా కేవలం క్షణాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు జనాలు. ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ తో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

 ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే కొన్ని విషయాలు ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఏకంగా ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి కూడా ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక మహిళ గురించే. సాధారణంగా తమకు ఏదైనా కీడు తలపెడితే ఒక మనిషి మరో మనిషి పై పగ పెంచుకోవడం చూస్తూ ఉంటాం. సమయం సందర్భం చూసుకొని పగ తీర్చుకోవాలని భావిస్తూ ఉంటారూ. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం మనిషి పై కాదు ఏకంగా ఒక ఎలకపై పగ పెంచుకుంది. ఎలకపై పగ పెంచుకోవడమేంటి గురు.. వినడానికి కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా.

 కానీ ఇక్కడ అదే జరిగింది. ఏకంగా తన వేలిని కొరికిందని ఒక యువతి పగబట్టి మరి చిట్టెలుక పనిబట్టింది. చైనాలోని ఓవర్సీటీ హాస్టల్లో ఉంటున్న యువతీ  నిద్రపోతున్నప్పుడు చిట్టెలుక వేలుని  కొరికింది. దీంతో ఇక ఆ ఎలుకను వెంటాడి పట్టుకొని మరీ దాన్ని తలపై కొరికేసింది యువతీ. మరీ గట్టిగా పట్టుకోవడంతో చిట్టేలక ఊపిరాడక మరణించింది. కొరికే క్రమంలో పెదాలకు గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళింది. అయితే ఆ గాయం ఎందుకు అయిందో ఆ యువతి వివరించగా.. అది విని డాక్టర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rat

సంబంధిత వార్తలు: