షాకింగ్ ఘటన : కరెంటు పోవడంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి?
ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు అనూహ్య ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా కరెంటు పోవడం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోయింది. అదేంటి కరెంటు పోతే ప్రాణం ఎందుకు పోతుంది అనుకుంటున్నారు కదా. అయితే ఇలా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కరెంటు పోయిన సమయంలో వెంటిలేటర్ పై ఉన్నాడు. చివరికి ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక ఒక రోగి మరణించాడు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల బిక్షపతినీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్ చేయగా అది పనిచేయలేదు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వెంటిలేటర్ ఆఫ్ అయింది. దీంతో ఇక ఊపిరి అందక అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల కొరతకు నిదర్శనంగా మారిపోయింది అంటూ ఇక ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు.