మండపంపైనే వరుడు అరెస్ట్.. పెళ్లి ఆగడం ఎందుకని వధువు ఏం చేసిందంటే?
ఇక ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి సినిమాల్లోనే అనుకున్నాం. నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా వరుడు నేరం చేసాడు అని అరెస్టు చేశారు పోలీసులు. అయితే పెళ్లి ఆగిపోయింది. ఇక ఇంత ఖర్చు వృధాగా పోతుంది అనుకుందో లేదా ఇంకేం ఆలోచించిందో కానీ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుండా ఏకంగా అతని సోదరుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగడ్ లో వెలుగులోకి వచ్చింది.
మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారూ. ఈ క్రమంలోనే ఇక చోరీకి పాల్పడిన నిందితుడిని పైజల్ గా గుర్తించారు. అయితే మరోవైపు అతనికి యువతీతో పెళ్లి జరుగుతుంది. దీంతో పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు పెళ్లి తంతు మధ్యలోనే పైజల్ ని అరెస్టు చేశారు అతను కూడా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో పెళ్లి వేదిక వద్ద వధువు ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే యువతిని పెళ్లి చేసుకున్నందుకు వరుడు తమ్ముడు ముందుకు వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించగా పెళ్లి తంతు పూర్తయింది.