భార్యకు ఎఫైర్ ఉంది అనే అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా?
మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండాల్సింది పోయి.. చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి అక్రమ సంబంధాలకు తెర లేపుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా పోతున్న ప్రాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతటి నరకాన్ని అనుభవించాల్సి వస్తుందా అంటూ అమ్మాయిలు అబ్బాయిలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవలే ఒక హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. అయితే వివాహేతర సంబంధం కారణంగానే భర్త భార్యను హత్య చేశాడు అన్న విషయం పోలీసుల విచారణలో తేలింది.
నాగబాబు, మల్లీశ్వరిలకు గతంలో వేరువేరుగా పెళ్లిళ్లు జరగ్గా.. తమ భాగస్వాములతో విభేదాలు రావడంతో వాళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగబాబు, మల్లేశ్వరి మధ్య పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో సహజీవనం చేయడం మొదలు పెట్టారు. కాగా అమలాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించినపుడు అందులో పని చేసే వ్యక్తితో మల్లీశ్వరి కి కూడా పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరు స్నేహితుల్లాగానే మెలిగేవారు. కానీ నాగబాబుకు మల్లీశ్వరి పై అనుమానం పెరిగింది. దీంతో సన్నిహితంగా ఉండడంతో అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకొని దారుణంగా హత్య చేశాడు. ఇటీవలే మల్లేశ్వరి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదయింది. కాగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.