ఉద్యోగం నుండి పీకేసారని.. అతనేం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా తగ్గిపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి మానవత్వంతో మెరగాల్సిన మనిషి.. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు. ఇక చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే పగా ప్రతీకారంతో రగిలిపోతున్న మనిషి చివరికి ఎంతటి దారుణానికి పాల్పడేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.



ఈ క్రమంలోనే కొంతమంది చేసే పిచ్చి పనులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయిన ఒక న్యూస్ గురించి కలిసి వామ్మో ఇలాంటి ఉద్యోగులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఉద్యోగంలో ఒక వ్యక్తిని పెట్టుకోవాలా తీసేయాలా అనేది కేవలం యాజమాన్యం నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్లకి ఇష్టముంటే పెట్టుకుంటారు లేదంటే తీసేస్తారు.

 ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేసారు. అయితే అది మనసులో పెట్టుకున్న వ్యక్తి చివరికి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో తాను  పని చేస్తున్న బార్ కే నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మెక్సికో లోని సానోర రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కాగా ఇలా చనిపోయిన వారిలో ఏడుగురు పురుషులు నలుగురు మహిళలు ఉండగా.. మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఉద్యోగిని బార్ నుంచి తొలగించారు. అయితే సదరు ఉద్యోగి తనను బార్ నుంచితొలగించారు అనే కోపంతో అతను ఇలా బార్ కి నిప్పు అంటించినట్లు పోలీస్ విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: