ఎంతకీ పెళ్లి కావట్లేదని.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరే ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఆధునిక యుగం లో ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటున్న మనిషి ఎందుకో చిన్న చిన్న విషయాల్లో మాత్రం విచక్షణతో ఆలోచించడం లేదేమో అని అనుమానం ప్రతి ఒక్కరి లో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలం లో చిన్న చిన్న కారణాలకి అక్కడితో జీవిత ముగిసి పోయింది అని బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.

 క్షణికావేషం  లో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నారు ఎంతో మంది. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారి వరకు అందరూ కూడా ఇదే తరహా ఆలోచన తీరు తో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఎంతకీ పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన యువతి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరం లోనే జరిగింది.

 పుప్పాలగూడ కు చెందిన శ్రియ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే గత కొన్ని ఏళ్లుగా శ్రీయ రెడ్డికి ఎన్ని సంబంధాలు చూసిన సెట్ కావడం లేదు. దీంతో పెళ్లి కావడం లేదని ఆమె డిప్రెషన్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో సోడియం నైట్రేట్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు పోయాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: