అమ్మాయిని మగాడిగా మారుస్తానని.. మాంత్రికుడు ఏం చేశాడంటే?

praveen
టెక్నాలజీ వెంట మనిషి పరుగులు పెడుతున్నాడు. ఇక అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే ఇలాంటి టెక్నాలజీ యుగంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మానేసి.. ఏకంగా బాబా దగ్గరికి వెళ్లి తాయత్తు కట్టించుకుంటున్న అమాయకపు జనాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఇలా టెక్నాలజీ యుగంలో కూడా ఎంతోమంది బురిడీ బాబాలు ఆటలు సాగుతున్నాయి అంటే ఇక మనుషులు ఇంకా మూఢనమ్మకాల్లోనే మునిగి తేలుతున్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు.


 అయితే ఇలా మంత్ర తంత్రాల మాయలో పడిపోతున్న ఎంతోమంది చివరికి నిండా మోసపోతున్నారు. కొంతమంది చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని కూడా కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా మహిళను పురుషుడిగా మారుస్తాను అంటూ ఆమెను హత్య చేశాడు ఒక క్షుద్ర మాంత్రికుడు. ఈ ఘటన కాస్త సంచలనంగా  మారింది. దీంతో మాంత్రికుడితో పాటు అతనికి సహకరించిన మృతురాలి స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు యూపీ పోలీసులు. షాహజనబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.



 పూనం, ప్రీతి అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. అయితే ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం ఏర్పడింది. ఇక వీరి మధ్య ఉన్న సంబంధం గురించి ఊరి లో వారికి తెలియడంతో ప్రీతి పెళ్లికి ఆటంకం ఏర్పడింది. దీంతో పూనమ్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళ క్షుద్ర మాంత్రికుడు అయినా రామ్ నివాస్ తో కలిసి ప్లాన్ వేసారు. ఈ క్రమంలోనే హత్య చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మహిళను పురుషుడిగా మారుస్తాను అంటూ నమ్మించి దారుణంగా పూనమ్ ను హత్య చేశారు. అయితే పోలీస్ విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: