ఓరిదేవుడా.. ఇంత చిన్న కారణానికి కూడా.. ఆత్మహత్య చేసుకుంటారా?

praveen
అప్పుడెప్పుడో శ్రీశ్రీ చెప్పారు.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ళ.. కాకి పిల్ల కవితకు కాదేది అనర్హం అని. అయితే నేటి రోజుల్లో జనాలు మాత్రం దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేటి రోజుల్లో జనాలు అటు ఆత్మహత్యకు కాదేది అనర్హం అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చిన దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. వెరసి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ కుటుంబంలో విషాదాన్ని  నింపుతున్న ఘటనలు నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.



 ఇక కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా అనే భావన ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. భార్య తలుపు తీయలేదు అనే మనస్థాపం చెందిన భర్త చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది. చిలప్ చేయడం మండలం గంగారం గ్రామానికి చెందిన వడ్డే మల్లేశం అనే 27 ఏళ్ల యువకుడు రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు.


 ఇక ఇటీవలే రాత్రి సమయంలో మరోసారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యను తలుపులు తీయాలి అంటూ కోరాడు. అయితే సరిత మాత్రం భయపడి తలుపులు తీయలేదు. దీంతో మనస్థాపం చెందిన మల్లేశం ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే  ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు చెట్టుకు వేలాడుతున్న మల్లేశంని  చూసి ఒక్కసారిగా బోరున విలపించారు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: