విధి ఆడిన నాటకం.. తన ప్రాణం తానే తీసుకున్నాడు?

praveen
నాగరిక సమాజంలోకి అడుగుపెడుతున్న మనిషి  రోజురోజుకు తనలో ఉన్న ధైర్యాన్ని మాత్రం కోల్పోతున్నాడు అన్నది తెలుస్తుంది  ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకే చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంత చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా ప్రస్తుతం పరిస్థితి మారుతుంది. దీంతో స్కూల్ చదివే చిన్నారుల దగ్గర నుంచి ఇక పెళ్లై పిల్లలు ఉన్న వ్యక్తుల వరకు ఎంతో మంది ఇలా చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత మనిషిలో ధైర్యం అనేది పూర్తిగా చచ్చిపోయింది. అందుకే చిన్న సమస్యలు కూడా పెద్దదిగానే కనిపిస్తున్నాయి అన్న విషయం అందరికీ అర్థమవుతుంది.. అందుకే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. మల్లేశం అనే 27 ఏళ్ల యువకుడు జీవితం పై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం అరణ్య రోదనగా విలపించింది అని చెప్పాలి.

 కొర్పోల్ గ్రామానికి చెందిన మల్లేశం గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఎన్ని ఆసుపత్రులు పెరిగినప్పటికీ అతని ఆరోగ్యం మాత్రం బాగు కాలేదు. దీంతో ఇక అతను మనస్థాపంతో కృంగిపోయేవాడు. చివరికి జీవితం పై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక తన జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక పొలం వద్ద ఉన్న షెడ్డులోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వైపుకు వెళ్ళిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: