మరో శ్రద్ధ వాకర్ ఘటన.. చంపి ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు?

praveen
ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా శ్రద్ధ వాకర్  స్వయంగా ప్రియుడు దారుణంగా నరికి చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టడం అందరిని నీవేరపోయేలా చేసింది. నేటి సభ్య సమాజంలో ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారా అని అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి. ఇక శ్రద్ధ వాకర్ హత్యకు సంబంధించిన ఎన్నో నిజాలు బయటపడుతూ అందరిని నివ్వెర పోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఢిల్లీలో శ్రద్ధ వాకర్ దారుణ హత్యకు సంబంధించిన ఘటన గురించి మరవకముందే ఇక ఇలాంటి తరహా దారుణాలు చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి తరహా ఘటన అని చెప్పాలి.  వారిద్దరూ ప్రేమించుకున్నారు.  పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. ఇక అన్ని రకాల అవసరాలను తీర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం పెళ్లి చేసుకుంటాను ఇచ్చిన మాటను పక్కనపెట్టి.. వేరే యువతి తో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో నన్ను కాకుండా వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ ఆ యువతి అతనితో వాగ్వాదానికి దిగింది.

 అయితే ప్రాణంగా ప్రేమించిన వాడే చివరికి తన ప్రాణాలు తీస్తాడు అని మాత్రం ఊహించలేకపోయింది.  ఏకంగా ప్రేమించిన యువతితో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని భావించిన సదరు వ్యక్తి దారుణంగా ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్లో పెట్టాడు. నిక్కీ యాదవ్ అనే యువతిని ప్రియుడు హత్య చేశాడు. ఆమె శరీరాన్ని నజాఫర్ ఘడ్ లోని ఒక దాబాలో ఫ్రిడ్జ్ లో దాచాడు. ఈనెల తొమ్మిదవ తేదీన నిక్కి యాదవ్ ప్రియుడు సాహిల్ తో గొడవపడగా ఇక ప్రియురాలని చంపి ఫ్రిజ్లో పెట్టి తర్వాత రోజే పెళ్లి చేసుకున్నాడు సాహిల్.  ఇక ఇటీవల విచారణలో ఈ నిజాలన్ని బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: