ఓరిదేవుడా.. నోట్లో పాలు పోయగానే.. లేచి కూర్చున్న శవం?
అదే సమయంలో ఇటీవల కాలంలో ఏకంగా చనిపోయి కుటుంబ సభ్యులందరినీ కూడా శోకంలో ముంచేసిన కొంతమంది చితికి నిప్పు అంటించే చివరి నిమిషంలో ఏకంగా పాడపై లేచి కూర్చోవడం లాంటివి జరిగితే ఎవరి వెనులో అయినా వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా ఒక వ్యక్తి చనిపోగా అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చనిపోయాడని భావించిన ఓ రైతు నోట్లో పాలు పోయగానే.. అతడు ఉన్నఫలంగా సజీవంగా లేచి కూర్చున్నాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.
పుదుకొట్టాయి జిల్లా పొన్నమరావతి సమీపంలోని ఆనమదం పట్టి గ్రామానికి చెందిన షణ్ముఖం అనే 61 ఏళ్ళ వ్యక్తి గుండె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే గత 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అపస్మాదక స్థితిలోకి చేరుకున్నాడు. తర్వాత ఆసుపత్రి సిబ్బంది అతని ఇంటికి పంపించగా అపస్మారక స్థితిలో ఉండడంతో చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యన్ మాల తీసేసి ఇక సాంప్రదాయం ప్రకారం తండ్రి నోట్లో పాలు పోశాడు.కానీ అప్పుడే షణ్ముఖం శరీరంలో కదిలికలు కనిపించారు. దీంతో బంధుమిత్రులు ఆశ్చర్యపోయి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు