మతిస్థిమితం లేదు.. వంట నూనెకు బదులు పురుగుల మందు వేసింది.. చివరికి?

praveen
సాధారణంగా మతిస్థిమితం లేని వారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు అప్పుడే సాధారణంగా ప్రవర్తించడం అంతలోనే చిత్రవిచిత్రమైన పనులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాగా కొన్ని కొన్ని సార్లు మతిస్థిమితం లేని వారు చేసే పనులు ఏకంగా ప్రాణాలమీదికి తేవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి వారికి ఉండదు కాబట్టి వాళ్లకు తోచింది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని మహిళా చేసిన పనికి చివరికి ఒక కుటుంబం ప్రాణాలు మీదికి వచ్చింది.

 వంటనూనె అనుకొని చివరికి పురుగుల మందు వేసి కూరలు చేసింది. వాటిని తాను తినడమే కాదు కుటుంబ సభ్యులకు కూడా ప్రేమగా వడ్డించింది. దీంతో ఆ వంటలు తిన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషమంగా మారడంతో చివరికి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మేడిద పల్లి కి చెందిన బండ్ల నాగమ్మ, పుల్లయ్య దంపతులు గ్రామంలో నివాసముంటూ వ్యవసాయం చూసుకుంటున్నారు. గత కొంత కాలం నుంచి నాగమ్మా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంది.

 అయినప్పటికీ భర్తకు సహాయం గా ఉంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంది. అయితే అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇక ఇటీవల రోజు లాగానే వంట చేసింది. ఈ క్రమంలోనే వంట నూనె కు బదులు పురుగుల మందు వేసి కూర వండింది. అదే వంటకాలతో తిని పొలం పనులకు వెళ్ళాడు భర్త. ఆమె కూడా భోజనం చేసింది. అయితే కూతురు మాత్రం ఏదో వింత వాసన రావడంతో ఆ భోజనం తినలేదు. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య అవేమీ పట్టించుకోకుండా ఆహారం తిన్నాడు. దీంతో వెంటనే నాగమ్మ పుల్లయ్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు.  కాగా నాగమ్మ మృతిచెందగా పుల్లయ్య ఇంకా ఆస్పత్రి లోనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: