వింత ఘటన : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. భర్తను వదిలేసిన భార్య?

praveen
ఇటీవల కాలంలో అసలు భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాల్లో  ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన భార్యభర్తలు చిన్న చిన్న కారణాలకే చివరికి విడిపోవడానికి సిద్ధపడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా భర్తకు ఉద్యోగం లేకపోతే కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోతే భార్య అతన్ని వదిలేసేందుకు సిద్ధపడటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము.

 ఒకవేళ భర్తకు మంచి ఉద్యోగం నుండి ఇక తనకు కూడా మంచి ఉద్యోగం వస్తే ఇక భార్య ఎంతో ఆనంద పడిపోతూ భర్తతో పాటు తాను కూడా సంపాదిస్తే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు అని భావిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం తనకు ఉద్యోగం రావడంతో ఎవరూ చేయని పని చేసి వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని ఏకంగా భర్తను వదిలేసింది మహిళా. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మాదే పుర జిల్లా కేదార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మిథున్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో అతనికి హర్ ప్రీతి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

 కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. కొన్నాళ్ళ పాటు సహజీవనం చేసి ఆ తర్వాత ఇద్దరూ కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  సంసార జీవితం కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది. అయితే భర్త సహకారంతో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. ఈ క్రమంలోనే భార్య కోసం తాను సంపాదించిన మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టాడు. లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పోలీస్ శాఖలు ఆమెకు ఉద్యోగం వచ్చింది. నమస్తి పూర్ జిల్లాలో పటోరీలో బాధ్యతలు కూడా స్వీకరించింది. భర్తతో సంతోషంగా ఉన్న ఆమెలో మార్పు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కారణంతో భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో భర్త మిథున్ తట్టుకోలేకపోయాడు.  పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: