భర్త మంచాన పడటంతో.. కోరికలు ఆపుకోలేక.. ఆమె ఏం చేసిందంటే?
హైదరాబాద్లో కాపురం పెట్టేసింది. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. 15 ఏళ్ల తమ కొడుకు అదృశ్యం అయ్యాడు అంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. అతని ఇంటి ఎదుట ఉండే 30 ఏళ్ల మహిళ కూడా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీంతో సాంకేతికత సాయంతో వారి ఆచూకీ గుర్తించారు. హైదరాబాద్లోని బాలానగర్లో వీరిద్దరూ ఒక రూమ్ లో కాపురం పెట్టినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహిళ చెప్పిన సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారు. 30 ఏళ్ల వివాహిత 15 ఏళ్ల బాలుడి ని ప్రేమించిందట. ఇక అతనితో శాశ్వతంగా ఉండాలని మాయ మాటలు చెప్పి ఇలా హైదరాబాద్ తీసుకు వచ్చినట్లు తెలుసుకున్నారు పోలీసులు.
15 ఏళ్ల బాలుడికి పోర్న్ వీడియోలు చూపించి ఇక శారీరక సంబంధాన్ని కొనసాగించినట్లు తేలింది. అయితే ఇలా బాలుడితో ఇంటినుంచి పారిపోయిన మహిళలకు పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఆమె భర్త ఆరోగ్య సమస్యల కారణంగా మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో ఇదే అదునుగా భావించిన సదరు మహిళ ఇలాంటి నీచమైన పనికి పాల్పడింది. ఎదురింట్లో ఉండే బాలుడిని బుట్టలో వేసుకుని చివరికి చేయకూడని పనులన్నీ చేసింది. ఈ ఘటనపై పోలీసులు సదరు మహిళకు 15 ఏళ్ల బాలుడికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.