మహిళ ఎస్సై పై అత్యాచారం.. నిందితుడు ఎవరో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎక్కడా తగ్గడం లేదు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. ఈ క్రమంలోనే ఆడపిల్ల ఒంటరిగా కనిపించిందంటే చాలు మగాడు మృగంలా మారిపోయి చివరికి దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా హత్యలు సైతం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎవరికైనా సమస్య వస్తే ఇక పోలీసుల దగ్గరకు వెళ్ళి తమ గోడును వెల్లబోసుకుంటారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఒక మహిళా పోలీసు అధికారిణికి సమస్య వచ్చింది.

 సాధారణ ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురైతే రక్షించే  పోలీస్ అధికారిని పైనే చివరికి అత్యాచారం జరిగిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆర్టిఏ హోంగార్డు నీచ బుద్ధితో ఏకంగా సహోద్యోగికి మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించాడు. చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించి ఈ వీడియో ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రవాణా శాఖ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న s ఉద్యోగుని పై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 అయితే నాలుగేళ్ల క్రితమే ఇలా సదరు మహిళా అధికారి పై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీడియో ని చూపిస్తూ బెదిరింపులు పాల్పడుతూ ఇన్ని రోజుల వరకూ తన కీచక పర్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ఇటీవల ధైర్యం తెచ్చుకున్నా మహిళా అధికారిని హోంగార్డు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. ఆ హోంగార్డు పేరు స్వామి ఖమ్మం ఆర్టీఏ లో పని చేస్తున్నాడు. ఇక అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సహోద్యోగినిపై స్వామి అత్యాచారం చేయడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: