పాములు పడితే రూ. 22 వేలు.. గిరాకి భలే ఉందే?
ఈ క్రమం లోనే వరదల కారణంగా పూర్తిగా బురద మయంగా మారి పోయిన ఇళ్లను ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్న మయ్యారు అందరు. అయితే ఇటీవలి కాలం లో మంచిర్యాల్ లో వరదల నేపథ్యం లో సరికొత్త సమస్య వచ్చింది. వరదల తో పాముల బెడద ఏర్పడటం తో పాములు పట్టే వారికి గిరాకీ పెరిగి పోయింది. ఇటీవలే వచ్చిన వరదల కారణం గా మంచిర్యాల పట్టణం గోదావరి తీరం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం లోకి కుప్పలు తెప్పలుగా సర్పాలు కొట్టు కొచ్చాయి. ఇందులో విష సర్పాలు కూడా ఉండటం గమనార్హం.
ఇటీవల వరదలు తగ్గడంతో బురదను శుభ్రం చేస్తుండగా పాములు బయటపడుతున్నాయి. ఇటీవలే ఆసుపత్రిలో బురద తొలగిస్తున్న సమయంలో ఓ మహిళను పాము కాటు వేయటంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు పాములు పట్టే వారిని పిలిపించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు పాములను పట్టేందుకు పెద్దపల్లి జిల్లా కలవచర్ల కు చెందిన శ్రీనివాస్, బెల్లంపల్లికి చెందిన సంజీవ్ లకు 22,000 ఇచ్చేందుకు ఒప్పుకున్నారు అధికారులు. ఇలా ఏకంగా పాముల బెడదతో పాములు పట్టేవారిని పిలిపించడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.