పెళ్ళై 45 రోజులు. అది జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య?

praveen
ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. రెండు మనసుల మధ్య ఎప్పుడు ఏ క్షణంలో ప్రేమ పుడుతుంది  అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెప్పపాటుకాలంలో పుట్టిన ప్రేమ నిండు నూరేళ్ళ పాటు ఎంతో సంతోషంగా జీవిస్తాము అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లో ప్రేమను గెలిపించుకోవాలి అనే ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ప్రేమను గెలిపించుకోలేక పోతున్న ఎన్నో జంటలు చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

 జీవితంలో ఎలాగూ కలిసి ఉండలేకపోతున్నాము కనీసం చావులో అయినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటాము అని కఠిన నిర్ణయం తీసుకుంటూ చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు. ప్రేమించిన వారి గురించి ఆలోచిస్తున్నారు కానీ తమ మీదే ఆశలు పెట్టుకున్న కుటుంబసభ్యులు గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఒక ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోలేక చివరికి చావులో కలిసి ఉండాలని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 క్రిష్ణగిరి మండలం మల్యాల లో ఉండే ప్రసాద్ అనిత అనే యువతి యువకులు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.  ప్రేమను ఇంట్లో చెప్పిన ఒప్పుకోలేదు. చివరికి వీరి ప్రేమను కాదని వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ కి  అతని అక్క కూతురు ని ఇచ్చి.. 45 రోజుల క్రితం పెళ్లి చేశారు. ఇక పెళ్లి ఇష్టంలేక అక్క కూతురు తో గడపలేక ఇక ప్రేమ దూరం అయింది అన్న విషయాన్ని జీర్ణించుకోలేక చివరికి తన ప్రియురాలితో కలిసి ప్రసాద్ రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: