ప్రేమ పెళ్లి.. కానీ ఆ నిజం తెలియడంతో.. కోర్టుకు భార్య?

praveen
పెళ్లంటే నూరేళ్లపంట.. ఎందుకంటే ఒకసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత భాగస్వామితో జీవితాంతం ఎంతో సంతోషంగా గడపాల్సి ఉంటుంది. ఇక దాంపత్య బంధంలో ఏమాత్రం గొడవలు ఉన్న అవి జీవితాన్ని దుర్భరం మార్చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది భార్యా భర్తల మధ్య చిత్రవిచిత్రమైన సమస్యలు వస్తూ ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక్కడ ఓ యువతి  యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన రెండేళ్ల తర్వాత ఆమె భర్త గురించి చేసిన ఆరోపణలు అన్నీ సంచలనంగా  మారిపోయాయి అని చెప్పాలి.

 మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుడియా ప్రాంతంలో నివాసముండే మహిళకు 2018లో 32 ఏళ్ల వ్యక్తి తో పెళ్లి జరిగింది.  ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే రెండేళ్ల పరిచయం తర్వాత వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇక భార్యాభర్తలు పూణేకు వెళ్లిపోయారు.. అయితే పెళ్లయి 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య చేసిన ఆరోపణలు మాత్రం సంచలనంగా  మారిపోయాయి. పెళ్లయిన తర్వాత భర్త ఎప్పుడూ తనకు దూరం గానే ఉండే వాడిని.  ఇక ఎన్నడూ కూడా భర్తతో సాహిత్యం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

 భర్త కు దగ్గరగా వెళ్లాలని ప్రయత్నించినప్పుడల్లా భర్త వేరే గదిలోకి వెళ్లే వాడంటూ తెలిపింది. భర్త తీరుపై అనుమానం వచ్చి ఇక నిఘా పెట్టిందట. ఈ క్రమంలోనే భర్త సాయంత్రం కాగానే స్త్రీలాగా అలంకరించుకోవడం ప్రారంభిస్తాడని బాధితురాలు తెలిపింది. ఆడవాళ్ల లాగానే హెయిర్ బ్యాండ్, నుదిటి పై బొట్టు, చెవిపోగులు పెదవులకు లిప్ స్టిక్ ధరించి భర్త విచిత్రంగా ప్రవర్తిస్తాడు అంటూ చెప్పింది బాధితురాలు. జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు నెలకు భార్యకు 30 వేల  రూపాయలు భరణంగా ఇవ్వాలని భర్తకు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: