అరే ఏంట్రా ఇది.. పోలీసులకు షాకిచ్చిన దొంగ?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడదా కాస్త ఎక్కువగానే ఉంది అన్న విషయం తెలిసిందే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అందినకాడికి దోచుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో అటు ఇంటి ముందు పార్క్ చేసిన  వాహనాలను దొంగలించడం ఇలాంటి ఘటనలు కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొంత మంది దొంగలు మాత్రం ఏకంగా భయం బెరుకు లేకుండా పోలీసులకు సంబంధించిన వస్తువులు చోరీ చేసి పోలీసులకే  ఊహించని షాక్ ఇస్తూ ఉంటారు.

 ఇక్కడ ఒక దొంగ కూడా ఇలాంటిదే చేశాడు. ఏకంగా పోలీసు జీపు దొంగలించి ఖాకీలకు షాకిచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బస్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అత్తారింట్లో ఉన్న భార్యను కలవాలని ఎంతగానో ఆరాటపడ్డాడు సదరు యువకుడు.ఈ క్రమంలోనే పోలీసు జీపు దొంగలించి ఎత్తుకు వెళ్ళాడు. ఉత్తరప్రదేశ్ లోని బస్తి జిల్లాలో సోనాపూర్ లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళనం నిర్వహించగా.. అక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో  పోలీసులు తమ వివాహాన్ని కాస్త దూరంలో పార్క్ చేశారు.

 ఈ క్రమంలోనే పుట్టింట్లో ఉన్న తన భార్యను చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు ఒక యువకుడు. అతని పేరు హరేంద్ర. టౌన్ లో టాక్సీ దొరక్కపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఎలాగైనా భార్యను కలవాలని దృఢ సంకల్పంతో రోడ్డు పక్కన ఖాళీగా  పోలీసు జీపు ఉండడం చూసి దానికి కన్నం వేశాడు. పోలీసులు ఒకవైపు జనం కార్యక్రమంలో ఉండగా.. అదే అదనుగా భావించిన అతను పోలీస్ జీప్ తీసుకు వెళ్ళాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతని వాహనంతో వెంబడించారు. జీపు ఎందుకు దొంగలించావ్ అంటు
  పోలీసులు ప్రశ్నించగా.. కొత్వాల్ ప్రాంతంలో అత్తారింట్లో ఉన్న తన భార్య ను చూసేందుకు అంటూ సమాధానం చెప్పాడు. అయితే నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు అని పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: