తండ్రి లేని బాలికపై కన్ను.. చివరికి?

praveen
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలు విధించినా అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేసి ప్రాణాలు తీస్తారు అన్న భయం ఎవరి లో కనిపించడం లేదు. దీంతో మనుషులు మానవ మృగాలు గా మారిపోతూ ఆడపిల్లలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. వెరసి రోజురోజుకీ ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతోంది అనే చెప్పాలి.

 ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. 9 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక్కడ ఒక ఆటో డ్రైవర్. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్లో నివాసం  ఉండే షేక్ సలీం అనే 30 ఏళ్ల వ్యక్తి మలక్పేటలో ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎదురింట్లో ఉండే బాలిక పై అతని కన్ను పడింది.

 అయితే తండ్రి లేకపోవడంతో ఇక తల్లి కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల 9 ఏళ్ల బాలిక ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో సిగరెట్ తెమ్మని బాలికను ఇంట్లోకి పిలిపించుకున్నాడు. ఇక తాను చెప్పినట్లు చేయక పోతే మీ బాబాయి తో చెబుతాను అని బెదిరించాడు. మూడు రోజుల పాటు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవలే ఓ ఇంట్లోకి వెళ్లిన బాలిక ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో గమనించిన చుట్టుపక్కల బాలికలు ఇక బయటికి వచ్చాక ఏం జరిగింది అని నిలదీశారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న  బాలిక తల్లి పోలీసులకు ఆశ్రయించింది.  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కామాంధుడిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: