అందరూ కలిసి మద్యం తాగారు.. ఒకరి ప్రాణం పోయింది?
ఇకపోతే జగన్నాధపురం మహిళా కళాశాల సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు నలుగురు. ఇటీవలే ఒక హోటల్ రూం బుక్ చేసుకుని అక్కడే ఆ నలుగురు స్నేహితులు కూడా రామకృష్ణ బిర్లా అనే మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు మద్యం తాగుతున్న సమయంలో రవి కాసు చెంపపై కాసుబాబు సరదాగా కొట్టాడు. ఆ తర్వాత సరదాగా కొట్టాను సీరియస్గా తీసుకోవద్దు అంటూ క్షమాపణ చెప్పాడు. అయితే కాసుబాబు మాత్రం ఈ విషయాన్ని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఆ విషయాన్ని అక్కడే వదిలేసినట్లు నటించి మద్యం తాగిన తర్వాత మాత్రం రామకృష్ణ బిర్లా లను తీసుకుని రవి కాసు బయటికి వెళ్ళాడు. కాసుబాబు సతీష్ హోటల్ రూమ్ లోనే ఉన్నారు.
ఇక తనను కొట్టి అవమానించినట్లు భావించిన రవి కాసు ఏకంగా హోటల్ రూమ్ లోకీ వచ్చి బీర్ బాటిల్ తో అతనిపై దాడి చేశాడు. ఇది పగిలిన గాజు సీసా ముక్కతో కంఠంలో పొడిచాడు. ఈ క్రమంలోనే సతీష్ అడ్డుపడేందుకు పోగానే ప్రాణాలు కూడా తీస్తా అంటూ బెదిరించడంతో అక్కడినుంచి పారిపోయాడు. ఇక అనంతరం రవి కాసు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. రవి కాసు సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి..