కొడుకు, కోడలిని చంపిన తండ్రి..చివరికి హైడ్రామా..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన దీప్ తివారీకి ప్రస్తుతం 65ఏళ్లు. స్థానికం గా ఓ టీ కొట్టును నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీప్ తివారీ కొడుకు శివ.. సుమారు ఐదు నెలల క్రితమే జూలీ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో దీప్ తివారీ దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో పడుకున్న కొడుకు, కోడలి ని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మేడ మీదకు వెళ్లి నిద్రపోయాడు. అయితే శివ, జూలీ విగత జీవులుగా పడి ఉండటంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీప్ తివారీ.. డ్రామా మొదలు పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి హత్య చేసి ఉంటారని కట్టు కథ అల్లాడు. అయితే పోలీసులు తమ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు..కొడుకు ప్రేమ పెళ్ళి చేసుకోవడం వల్ల తనకూ అప్పుల బాధలు మరింత ఎక్కువ అయ్యాయని చెప్పాడు.నెలనెలా డబ్బులు కట్టకపోవడం తో తన స్థలం లోంచి టీషాపును తీసేయాలని ఓనర్ ఒత్తిడి చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోడకు, కోడలు ను హత్య చేసి, అనంతరం తాను కూడా హత్య చేయాలని భావించినట్టు చెప్పాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.