ప్రియుడిని చంపిన మహిళ.. ఎందుకో తెలుసా?

praveen
బంధాలు బంధుత్వాలకూ విలువ ఇవ్వని మనుషులు ఉన్మాదులు గా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో ఇప్పుడు ఆ మానవత్వమే కనిపించకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా కాస్తయినా వెనక ముందు ఆలోచించని పరిస్థితి ఏర్పడింది. అరటిపండు తొక్క ఒలుచుకొని తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. దీంతో ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేసి ప్రాణాలు తీస్తారో అనేది కూడా తెలియక అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది. ఏకంగా ప్రేమిస్తున్నాను అంటూ చెప్పిన ప్రియుడినే దారుణంగా హత్య చేయించింది ఇక్కడ ఒక మహిళ. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.  తనను పెళ్లి చేసుకోకపోతే అక్రమ సంబంధాన్ని బయట పెట్టేస్తాను అంటూ ప్రియుడు బ్లాక్ మెయిల్ చేయడంతో ఒక గృహిణి చివరికి ఆందోళన చెందింది. దీంతో తన ఫేస్బుక్ మిత్రుడితో కలిసి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి రావడం గమనార్హం.

 యశ్వ కుమార్ అనే వ్యక్తి వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. మీర్పేట ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేత రెడ్డి గృహిణి కావడం గమనార్హం. వీరిద్దరు కూడా 2018 లో ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఇక వీరిద్దరి మధ్య చనువు పెరిగింది. చివరికి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక ఆమెకు ఫోన్ చేసి యష్మ కుమార్ నగ్నంగా వీడియో కాల్ కావాలి అంటూ కోరాడు. ఇక సదరు గృహిణి కూడా కూడా కాదనకుండా వీడియో కాల్ చేసింది. ఇక సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. ఈ క్రమంలోనే వేధింపులు తట్టుకోలేక పోయినా మహిళా చంపాలని ఫేస్బుక్ ఫ్రెండ్ కూ చెప్పింది. ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: