వివాహేతర సంబంధం.. చివరికి భార్య ఏం నాటకమాడిందో తెలుసా?

praveen
భార్య భర్తలు అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్. ఏ కష్టం వచ్చినా భర్తకు భార్య.. భార్య కు భర్త ఎప్పుడూ తోడునీడగా ఉంటారు. అందుకే భార్యాభర్తల బంధాన్ని చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటివన్నీ నేటి రోజుల్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.. అయితే నిజ జీవితంలో మాత్రం భార్యాభర్తలు అన్యోన్యంగా కాదు బద్ద శత్రువులు గా మారిపోతున్నారు. ఏకంగా చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో అక్రమ సంబంధాల నెపంతో ఎంతోమంది కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి కట్టుకున్న వారిని హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులు రెండు రోజుల్లో ఛేదించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శివకుమార్ అనే తాపీ మేస్త్రి  ఈ నెల 5వ తేదీన రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే శివకుమార్ దారుణ హత్యకు గురి కావడానికి అటు భార్య కారణం అని తెలుస్తోంది.

 ఎందుకంటే మృతుడు శివ కుమార్ భార్య మాధవికి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని పోలీసు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే భర్తకు ఈ విషయం తెలిసి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడూ. కానీ భర్త కంటే ప్రియుడే ముఖ్యం అనుకున్న మాధవి అడ్డు తొలగిస్తే ఇక ప్రియుడితో ఎంతో సంతోషంగా జీవించవచ్చు అనే దురుద్దేశంతో ఇక ప్రియుడితో కలిసి పథకం వేసినట్లు తెలుస్తోంది. కానీ హత్య జరిగిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు  పోలీసులు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: