దారుణం : బాలింత అని కూడా చూడకుండా?

praveen
దారుణం.. ఘోరం.. నీచమైన.. ఈ పదాలు కూడా భయపడే ఘటనలు నేటి సభ్యసమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు చూసి సభ్యసమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చినా ఎందుకొ కామాంధుల తీరులో మాత్రం ఆ చట్టాలు మార్పు తీసుకు రాలేకపోతున్నాయ్. ఇక మహిళలపై వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడుతున్న ఎందుకొ మార్పు రావడం లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలింతను  కొంతమంది వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది చంపేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 ఇలా బాలింతను హత్య చేసిన దుండగులు కొంతదూరం మృతదేహాన్ని లాక్కెళ్లి పడేయడం గమనార్హం. ఆ తర్వాత శవం పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రస్తుతం అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కనగానపల్లి మండలం కి చెందిన మహిళకు 7 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు ఏడు నెలల కిందట ఒక బాబు పుట్టాడు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడు నెలల బాబును తోడికోడలుకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది సదరు మహిళ. అప్పటికే సదరు మహిళ కోసం కాపు కాసి కూర్చున్న  గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. బహిర్భూమికి  వెళ్లిన మహిళ 10 గంటలు దాటిన ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు భర్త కు ఫోన్ చేసి చెప్పారు.

 ఇక చుట్టుపక్కల వెతికినా ఆ మహిళ ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ ఊరి అవతల తల పూర్తిగా చింద్రమై  విగతజీవిగా పడి ఉన్న బాధితులను గమనించారు.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావి దగ్గర ఉన్న బండరాళ్లను తీసుకువచ్చి దారుణంగా తలపై మోది హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మహిళను హత్య చేసిన తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: