వైరల్ : ఈ యాక్సిడెంట్ చూశాక.. హెల్మెట్ అస్సలు మరిచిపోరు?

praveen
దేవుడు ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కీలుబొమ్మల లాంటివి అని అంటూ ఉంటారు ఎంతో మంది పెద్దలు. అయితే నేటి రోజులలో జనాలు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తు ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం పెద్దలు చెప్పిన మాట నిజమేనని నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు కుటుంబంలో విషాదం ఉంటాయి. సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని విధంగా క్షణ కాల వ్యవధిలో మృత్యువు దూసుకు వస్తూ ఉంటుంది. తప్పించుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది.

 ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది అని చెప్పాలి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది అనే చెప్పాలి. రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కొంతమంది హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుంటే మరికొంతమంది అతి వేగం కారణంగా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇక్కడ అతివేగం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది.

 ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి చివరికి లారీ టైర్ కింద పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట గ్రామంలో వెలుగులోకి వచ్చింది. స్వామి అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే గాగిల్లాపూర్ రోడ్డు వద్ద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతని ఢీకొట్టి ముందుకు దూసుకుపోయింది. ఈ క్రమంలోనే లారీ టైర్ కింద పడిన స్వామి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కాస్త వైరల్ గా మారిపోయింది. ఒకవేళ స్వామి హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలతో బయట పడే వాడిని కొంతమంది సీసీ టీవీ ఫుటేజ్ ను చూసిన తర్వాత అంటున్నారు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు అందరూ. స్వామి మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: