భర్త కోసం ఆ సాహసం చేసిన భార్య.. చివరికి ప్రాణం పోయింది?

praveen
మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తూ ఉంటుంది అంటూ ఉంటారు కదా. కొన్ని రకాల ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్త ప్రాణాలను కాపాడాలని ఎంతో రిస్కు చేసిన మహిళా చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ లో మునిగిపోయారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో ఏమాత్రం పట్టు తప్పిన రైలు కింద పడే ప్రమాదం ఉంటుంది.

 ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది పట్టుతప్పి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఓ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. అయితే భర్త ప్రాణాలు కాపాడడానికి సిద్ధమైన వివాహిత చివరికి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం మండలం రాచాను పల్లి లో వెలుగులోకి వచ్చింది. గోపాల్ రమాదేవి దంపతులకు మూడేళ్ల కుమారుడు యశ్వంత్ రెండేళ్ల కుమార్తె మేఘన ఉన్నారు. ఇటీవలే వీరు కుటుంబంతో కలిసి గుంతకల్లు వెళ్లేందుకు అనంతపురం రైల్వే స్టేషన్ వెళ్లారు. అక్కడ కాచిగూడ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

 ఈ క్రమంలోనే తొలుత భార్య ఇద్దరు పిల్లలను గోపాల్ రైలు ఎక్కించాడు. అయితే అప్పటికే రైలు ముందుకు కదిలింది. ఇలా కదులుతున్న రైలు లోకి ఎక్కేందుకు ప్రయత్నించిన గోపాల్ పట్టుతప్పి కిందపడి పోయాడు. ఈ క్రమంలోనే భర్తను కాపాడబోయి రమాదేవి రైలు ఫ్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఈ విషయాన్ని గమనించిన రైలులో ఉన్న ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపేసారూ. కానీ అప్పటికే దంపతులు ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పాలి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించని రమాదేవి చివరికి మృతి చెందింది. పిల్లలు సురక్షితంగానే ఉన్నారూ అన్నది తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: