ప్రియుడితో భార్య రొమాన్స్.. అంతలో డోర్ తీసిన భర్త.. చివరికి?
కానీ నిజం నిప్పులాంటిది ఎన్నటికైనా బయట పడాల్సిందే. కాగా ఓ రోజు భార్య అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసింది. నిన్ను ఎంతగానో నమ్మాను..నన్ను ఎలా మోసం చేయాలనిపించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో ఇలా చేయడం సరైనది అనిపించిందా అని గట్టిగా నిలదీశాడు. అయితే ఇక తన విషయం ఎక్కడ బయట పడుతుందో అని సదరు మహిళ భయపడింది. చివరికి భర్త ను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన బీహార్లో వెలుగుచూసింది. బీహార్లోని పుర్నియా జిల్లా చక్ర పద గ్రామానికి చెందిన వ్యక్తికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే పక్కింటి వ్యక్తితో సదరు మహిళకు పరిచయం ఏర్పడగా పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా అతనితో రాసలీలల్లో మునిగి తేలుతూ ఉంది సదరు మహిళ. కొన్నాళ్లపాటు సీక్రెట్ గా కొనసాగిన వీరి బంధం గురించి చివరికి భర్తకు తెలిసింది. ఓ రోజు వీరిని గమనించగా ప్రియుడితో భార్య రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉండడానికి కళ్లారా చూశాడు భర్త. దీంతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఇక అదే సమయంలో వీరి మధ్య వాగ్వాదం జరగడంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో అసలు నిజం బయట పడడంతో ఇక ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు..