రెండు రోజులుగా తలుపులు మూసి ఉన్నారు..పోలీసులు రావడంతో..

Satvika
కొన్ని సంఘటనలను నమ్మడం చాలా కష్టం.. కళ్ళకు నమ్మలేని విధంగా ఈ మధ్య కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి భార్య, కొడుకు తో కలిసి ఓ ప్రాంతం లో నివాసముంటున్నారు. అయితే ఓ రోజు అనుకోకుండా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు, అలా రెండో రోజు కూడా ఉన్నారు. దాంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్ళు ఈ విషయం పై పోలీసుల కు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఎంట్రీ ఇచ్చిన పొలిసులు అసలు విషయం గురించి బయట పెట్టారు.



కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.. వివరాల్లొకి వెళితే.. రాజస్థాన్‌ లోని సికార్‌కు చెందిన సంపత్ అనే వ్యక్తి తన భార్య పూజ, రెండేళ్ల కొడుకు చినూతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ ముగ్గరూ తమ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.. దాంతో వచ్చిన పోలీసులు తలుపులు పగల కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారు.

పూజ, చినూ మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి.



సంపత్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురి మృత దేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఇంటి పరిస్థితుల ను బట్టి చూస్తే బయటి నుంచి ఎవరూ లోపలికి వెళ్లలేదని అర్థమవుతోంది.. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే వాళ్ళు చనిపొయార ని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఒకే కుటుంబం లోని ముగ్గురు చనిపోవడం తో ఆ ప్రాంతం అంతా దిగ్ర్భాంతి లో ఉంది..మృత దేహాలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రి కి తరలించారు. అసలు కారణాలు ఏంటీ అనే కోణం లో పోలీసులు విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: