విడాకులు తీసుకున్నారు.. కానీ మళ్లీ ఇదేం పని?

praveen
భార్య భర్తల బంధం అన్యోన్యతకు  కేరాఫ్ అడ్రస్గా వస్తూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని ఒక్కటైన వారు భార్యాభర్తలు కాదు పగతో రగిలిపోయే బద్ద శత్రువులేమో అన్నట్లుగా భార్య భర్తలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కట్టుకున్న భార్యకు కడవరకు తోడు ఉంటానని చెప్పిన వారే చివరికి దారుణంగా హత్య చేసిన ఘటన లు అందరిని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలకు విడిపోవడం.. ఇక ఆ తర్వాత ఒకరిపై ఒకరు పగ పెంచుకోవడం జరుగుతుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మనస్పర్థల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు సదరు వ్యక్తి. కానీ భార్యపై పగ మాత్రం అలాగే ఉండిపోయింది. దీంతో మాట్లాడాలని పిలిచి దారుణంగా భార్య కాళ్ళు నరకమే కాదు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుముకూరు నగరంలో వెలుగులోకి వచ్చింది..  బాబు తుముకూరు మధుగిరి కి చెందిన అనితలకు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవలే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విడిగానే ఉంటున్నారు.


 అయితే భార్య పై కోపంతో రగిలిపోయిన భర్త బాబు ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడాలి అంటూ భార్య అతని పిలిపించాడు. ఇద్దరు హోటల్లో అల్పాహారం తీసుకున్న అనంతరం అక్కడి నుంచి ఈ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ మరోసారి భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే పథకం ప్రకారమే తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా భార్య కాళ్ళు నరికేసాడు బాబు. ఇక అక్కడ్నుంచి హోటల్కు వెళ్లి విషయాన్ని అక్కడి సిబ్బంది చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తట్టుకోలేక ఇలా చేశా అంటూ పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు భర్త బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: