ఉద్యోగి ఘనకార్యం.. రిచ్ గా పెళ్లి చేసుకోవడానికి?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. ఇక జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లికి ఎంతో అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు. ఒకప్పుడు సంపన్నుల పెళ్లిళ్లు మాత్రమే ఘనంగా జరిగేవి. కానీ ఇటీవలి కాలంలో సామాన్యుల పెళ్లిళ్లు సైతం రంగ వైభవంగా జరుగుతూ ఉండటం గమనార్హం.  ఇక నేటి రోజుల్లో ట్రెండ్ ఫాలో అవ్వడానికి కాస్త ఖర్చయినా పర్వాలేదు ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నారు సామాన్య ప్రజలు. ఇక ఎంతో కష్టపడి అప్పు తెచ్చుకొని మరీ పెళ్లి చేసుకుంటున్న  వారు కూడా లేకపోలేదు.


 ఇక్కడ ఒక వ్యక్తి ఘనంగా పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. ఇక రిచ్గా పెళ్లి చేసుకోవాలనుకున్న సదరు వ్యక్తి మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. చివరికి తాను పని చేసే బ్యాంకునే దోచేశాడు.. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  డి సి సి బ్యాంకు లో ఇటీవలే మార్చ్ ఆరవ తేదీన 6 కోట్ల విలువ చేసే బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ  చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అదే బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నా బసవరాజు సిద్ధంగను విచారించారు.


 తమదైన శైలిలో విచారణ జరపగా.. క్లర్క్ గా పనిచేసే వ్యక్తి అతని స్నేహితులు సంతోష్, గిరీష్ లతో కలిసి దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. ఇక వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు నాలుగు కోట్ల 20 లక్షల నగదు కోటి అరవై మూడు లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలను ఉపయోగించి క్లర్క్ గా  పనిచేసే వ్యక్తి దొంగతనం లో కీలక పాత్ర వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతను పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: