తల్లి చనిపోతే.. నిద్ర పోయింది అనుకున్నాడు.. కన్నీళ్లు తెప్పించే ఘటన?
దీంతో అతని మాటలతో కంగారు పడిపోయిన వ్యక్తి వెంటనే చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. ఇక అక్కడ జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఈ ఘటన తిరుపతిలోని విద్యానగర్ కాలనీ లో వెలుగులోకి వచ్చింది. కాలనీలో నివాసం ఉండే రాజ్యలక్ష్మి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి మానసిక ఎదుగుదల లేని కుమారుడితో వేరుగా ఉంటుంది. ఇటీవలే రాజ్యలక్ష్మికి వాంతులయ్యాయ్. దీంతో తీవ్రంగా నీరస పడిన ఆమె నేలపై పడుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి అలాగే మరణించింది. అయితే ఈ విషయం మతిస్థిమితం సరిగ్గా లేని కొడుకు శ్యామ్ కిషోర్ కి అర్థం కాలేదు.
తల్లి మంచి గాఢ నిద్రలో ఉందని లేపితే కోప్పడుతుంది అని అనుకున్నాడు. ఇక ఒక రోజు తల్లి మృతదేహాన్ని అలాగే వదిలేసి స్కూల్కి వెళ్లి వచ్చాడు. ఇక నాలుగు రోజుల పాటు తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. కాని ఆ తర్వాత దుర్వాసన రావడంతో మేనమామకు ఫోన్ చేసి అమ్మ నిద్ర పోతుందని ఆపరేషన్ చేయాలి అంటూ పిలిచాడు. దుర్గాప్రసాద్ వెంటనే వెళ్ళి చూసే సరికి నేలపై కుప్పకూలిన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..