తల్లి చనిపోతే.. నిద్ర పోయింది అనుకున్నాడు.. కన్నీళ్లు తెప్పించే ఘటన?

praveen
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని విషాదకర ఘటనలకు సంబంధించిన వార్తలు మాత్రం ప్రతి ఒక్కరిని కళ్ళు చెమర్చేలా చేస్తూ ఉంటాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తల్లి మరణించింది అన్న విషయం తెలియని కుమారుడు నాలుగు రోజుల పాటు ఆమె మృతదేహం పక్కనే నిద్రించాడు. అంతే కాదు తల్లి నిద్ర పోతుంది అని భావించి ఒక రోజు స్కూల్ కి కూడా వెళ్లి వచ్చాడు. ఇక ఇంట్లో ఉన్న మిగతా ఆహారాన్ని చిరుతిండ్లు తింటు ఉండిపోయాడు. కానీ ఆ తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడం మొదలయ్యింది. అయినప్పటికీ తల్లి చనిపోయింది అన్న విషయం మాత్రం ఆ కొడుకు కి అర్థం కాలేదు. వెంటనే మేనమామకు ఫోన్ చేసి అమ్మ నిద్రపోతుంది ఇళ్లంతా వాసన వస్తుంది ఆపరేషన్ చేద్దాం రండి మామయ్య అంటూ చెప్పాడు.

 దీంతో అతని మాటలతో కంగారు పడిపోయిన వ్యక్తి వెంటనే చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. ఇక అక్కడ జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఈ ఘటన తిరుపతిలోని విద్యానగర్ కాలనీ లో వెలుగులోకి వచ్చింది. కాలనీలో నివాసం ఉండే రాజ్యలక్ష్మి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి మానసిక ఎదుగుదల లేని కుమారుడితో వేరుగా ఉంటుంది. ఇటీవలే రాజ్యలక్ష్మికి వాంతులయ్యాయ్. దీంతో తీవ్రంగా నీరస పడిన ఆమె నేలపై పడుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లి అలాగే మరణించింది. అయితే ఈ విషయం మతిస్థిమితం సరిగ్గా లేని కొడుకు శ్యామ్ కిషోర్ కి అర్థం కాలేదు.

 తల్లి మంచి గాఢ నిద్రలో ఉందని లేపితే కోప్పడుతుంది అని అనుకున్నాడు. ఇక ఒక రోజు తల్లి మృతదేహాన్ని అలాగే వదిలేసి స్కూల్కి వెళ్లి వచ్చాడు. ఇక నాలుగు రోజుల పాటు తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. కాని ఆ తర్వాత దుర్వాసన రావడంతో మేనమామకు ఫోన్ చేసి అమ్మ నిద్ర పోతుందని ఆపరేషన్ చేయాలి అంటూ పిలిచాడు.  దుర్గాప్రసాద్ వెంటనే వెళ్ళి చూసే సరికి నేలపై కుప్పకూలిన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: