అత్యాచారం.. ఆపై విషం తినిపించి?

praveen
నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనిషి మానవ మృగం గా మారి పోతున్నాడు. సాటి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని మనిషి ఆడ పిల్లల విషయం  లో అయితే మరింత దారుణం  గా వ్యవహరిస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగం లాగా ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి  వస్తున్నాయ్. ఇక ఇలాంటి ఘటనలు ఆడపిల్లల రక్షణ ను ప్రశ్నార్థకంగా మారుస్తుంది అని చెప్పాలి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో రాంపూర్ దళిత మైనర్పై అత్యాచారం చేసి ఆమెకు విషం పెట్టి అడవిలో పడేసిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది.


 ఈ క్రమంలోనే  బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలింది. చనిపోయే ముందు పోలీస్ విచారణలో భాగంగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. సదరు మైనర్ బాలిక. కాగా బాలిక నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారు. అయితే బాలికపై నిందితుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో బాలిక ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే తనకు విషమిచ్చి అడవిలో పడేసాడు అంటూ మైనర్ బాలిక చెప్పింది.


 మైనర్ బాలిక ఇటీవలే పరీక్ష రాయడానికి బయటికి వెళ్ళిన సమయం లో గ్రామానికి చెందిన నిందితుడు ప్రలోభపెట్టి వెంట తీసుకెళ్లాడు. ఒక హోటల్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా  విషం  తినిపించి అడవి లో వదిలేశాడు. ఇక పరీక్షకు రాలేదని ఉపాధ్యాయులు తల్లి దండ్రులకు ఫోన్ చేయడం తో కుటుంబ సభ్యులు ఎంతో వెతికిన తర్వాత బాలిక ఆచూకీ కనుగ్గొన్నారు. ఈ క్రమం లోనే నోటి నుంచి నురగా వస్తు ఏడుస్తూ కనిపించిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లి దండ్రుల.ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు బాలిక మరణించడం తో ఆసుపత్రికి వద్దకు చేరుకున్న గ్రామస్తులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: