పాపం.. ఆ తల్లి మనసు ఎంత బాధ పడిందో.. కొడుకుని చంపేసింది?
అమితమైన ప్రేమను పంచిన ఆ మాతృమూర్తి చివరికి కన్నకొడుకు విషయంలో కర్కశంగా ప్రవర్తించింది. మానవత్వాన్ని పంచాల్సిన ఆ తల్లి హృదయం చివరికి పేగు తెంచుకుని పుట్టిన కొడుకు మరణం కోరింది. ఎంతోమంది మనసును కదిలిస్తున్న ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఇందువుల గ్రామానికి చెందిన సోములు శైలజా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇక ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో భార్య శ్రీనివాస్ నగర్ కాలనీలో కుమారులు రాజు గోపీచంద్ యోగేష్ లతో కలిసి నివాసం ఉంటుంది..
ఇక ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల పోషణ చూసుకుంటుంది. అయితే ఆమె రెండో కుమారుడు గోపీచంద్ పుట్టుకతోనే అందుడు. అంతేకాదు వయసు పెరుగుతున్న కొద్దీ అటు మానసిక స్థితి కూడా కోల్పోతూ ఉన్నాడు. దీంతో కనీసం అతని స్కూల్లో చేర్చుకునేందుకు కూడా నిరాకరించారు.అయితే అంధుడైన కొడుకు విషయంలో మానవత్వాన్ని చూపించాల్సిన తల్లి చివరికి కన్న పేగు బంధాన్ని మరిచి మరణం కోరుకుంది. కొడుక్కి సరైన ట్రీట్మెంట్ ఇప్పించు లేక పోతున్నాను అని బాధతో చివరికి వేములవాడ మండలం లోని సాగర్ ఎడమ కాలువలు కొడుకుని తోసేసింది.. ఇక అక్కడే కాలువలో ఈత కొడుతున్న మరో ఇద్దరు గమనించి పోలీసులకుసమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు..