దారుణం : 65 ఏళ్ల వృద్ధుడి కామం.. 25 ఏళ్ల యువతికి గర్భం?

praveen
మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఆ మానవత్వాన్ని వదిలేసి కామంతో ఊగిపోతున్నారు. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎలాగైనా కామ కోరికలు తీర్చు కోవాలని మానవ మృగాలుగా మారిపోతున్నారు. మాయ మాటలతో నమ్మించి అత్యాచారం చేస్తున్న వారు కొంతమంది అయితే బలవంతంగా పశువుల్లా మీద పడిపోయి అత్యాచారం చేస్తున్న వారు మరికొంతమంది. వెరసి ఆడపిల్ల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. కామపు కోరల్లో  తీసుకోకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఆడపిల్లలకు మాత్రం రక్షణ ఉండటం లేదు. దీంతో ప్రతి రోజు భయం భయం తోనే ఆడపిల్ల బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


  ఎక్కడో ఓ చోట ఆడపిల్లలపై అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 65 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మానసిక వికలాంగురాలైన యువతీని మాయమాటలతో లోబరుచుకుని చివరికి కామవాంఛలు తీర్చుకున్నాడు.  వృద్ధుడి కామానికి అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలు గర్భం దాల్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. భూదాన్ పోచంపల్లి మండలం లోని మోహన్ నగర్ లో ఘటన వెలుగులోకి వచ్చింది. మోహన్ నగర్కు చెందిన 25 ఏళ్ల యువతీ మానసిక వికలాంగురాలు.


 తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగానే ఉంటోంది. ఈమెకు ఇద్దరు అక్కలు ఉండగా వివాహం చేసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ యువతి ఒంటరిగా ఉండటమే తనకు అదునుగా మార్చుకున్న మల్లయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత లోబర్చుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఇక ఇటీవలే రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో ఉంటున్న అక్క ఇంటికి వెళ్లిన సదరు యువతి శరీరంలో పలు మార్పులు గమనించిన బావా చివరికి వైద్య పరీక్షలు చేయించగా ఊహించరు నిజం బయటపడింది. సదరు యువతి గర్భవతి అన్న విషయం తేలింది. దీంతో యువతి ని గట్టిగా నిలదీయడంతో జరిగిన అన్ని విషయాలు చెప్పింది. ఇక యువతీ అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: