షాకింగ్: హైదరాబాద్ నడిబొడ్డులో 3 గంజాయి స్మగ్లర్లు అరెస్ట్...

VAMSI
ఈ దేశం ఎక్కడికి వెళుతోంది. అభివృద్ధి పధం వైపు తీసుకు వెళ్ళడానికి కొందరు రేయిం బవళ్లు కష్టపడుతుంటే మరో వైపు కొందరు సంఘ విద్రోహ శక్తులు యువతీ యువకులను లక్ష్యంగా చేసుకుని వారిని మత్తు మోజుకు గురి చేసి నాశనం చేస్తున్నారు. ఇలా దాదాపు లక్షల మంది యువకులు పెడదారి పడుతున్నారు. విదేశాలకు మాత్రమే పరిమితం అయినా ఈ డ్రగ్స్ కల్చర్ ను భాగ్యనగరం వరకు తీసుకు వచ్చి యువత అర్దాంతరంగా తమ జీవితాలను కొంతమంది స్వార్ధ రాజకీయ, వ్యాపార నాయకులు అభివృద్ధికి బలి చేసుకుంటున్నారు. అయితే ఈ డ్రగ్స్ మాఫియాను రూపు మాపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటోంది.
అందులో భాగంగా వరుసగా అరెస్ట్ లు చేస్తూ వస్తున్న తీరు మనము చూస్తున్నాము. తాజాగా హైద్రాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్ లను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే, హైద్రాబాద్ లో రద్దీగా ఉండే ప్రదేశాలు అయిన బంజారా హిల్స్ దగ్గరలోని కేబీఆర్ పార్క్ దగ్గర గంజాయి ద్రావణాన్ని జూబిలీ హిల్స్ పోలీసులు కనుగొన్నారు. ఇక్కడ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ గంజాయిని కలిగి ఉండడంతో వారిని అక్కడి కక్కడే అరెస్ట్ చేశారు. అయితే ఇది కేవలం ఖచ్చితమైన సమాచారం తోనే జూబిలీ హిల్స్ పోలీసులు మాటు వేసి వారిని ఖైదు చేసినట్లు తెలుస్తోంది .
కానీ ఇందులో దుఃఖించే విషయం ఏమిటంటే ఈ ముగ్గురిలో డిగ్రీ చదివే కుర్రాడు ఒకరు కాగా, మైనర్ కుర్ర వాడు మరియు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఆఖరికి మైనర్ బాలుడిని కూడా ఈ డ్రగ్స్ దందా లోకి దింపారంటే ఎంత దారుణమైన సంస్కృతి అనేది తెలుస్తోంది. ఇంకా ఎంత కాలం ఇలా అమాయకులు వేరెవరో కోసం బలి కావాలి. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: