నాటు బాంబును కొరికిన కుక్క.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
సాధారణం గా వీధి కుక్కలు రోడ్డుమీద ఏది కనిపించినా కూడా వాటిని కొరికేయడం లేదా వాటి తో ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయ్. రోడ్డుపై ఏదైనా ఆహారం కనిపించిన కూడా వీధికుక్కలు తింటూ ఉండటం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వీధి కుక్క చేసిన పని ఏకంగా కింద దాని ప్రాణం పోవడానికి కారణం అయింది అని చెప్పాలి. బంతి అనుకొని నాటు బాంబును కొరికేసింది వీధి కుక్క. చివరికి ఒక్క సారిగా నాటు బాంబు పేలడంతో ఒక అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది.

 చిత్తూరు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. స్థానికుల సమాచారం తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాటు బాంబు ఎటు నుంచి వచ్చింది అన్న విషయం పై ఆరా తీయడం మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు కలకలం సృష్టించింది. ఏకంగా వేదిక నాటు బాంబు కొరకడంతో ఒక్కసారిగా అది పేలి పోయి కుక్క అక్కడికక్కడే చనిపోయింది. జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందని స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు.

 ఈ క్రమం లోనే శబ్దం వచ్చిన చోటికి పరుగున వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లి చూశాక జరిగిన సంఘటన అర్థమైంది.  నాటు బాంబు కొరకడం తో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది  అన్న విషయాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా నాటు బాంబు ప్రత్యక్షం అవడం తో ఈ నాటు బాంబు  ఎక్కడ నుంచి వచ్చింది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: