మిస్టరీ గా మారిన జైహింద్ నాయక్ హత్య కేసు ?

Veldandi Saikiran
నల్గొండ జిల్లా లో జై హింద్‌ నాయక్‌ అనే మతిస్థిమితం లేని వ్యక్తిని హత్య చేసి తమ మొండెం వేరు చే సిన సంఘటన అందరికీ తెలిసిందే. తలను నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారీ సమీపంలోని విరాట్‌ నగర్‌ కాలనీలో మెట్టు మహాంకాళీ ఆలయం అమ్మవారి వద్ద మొండెం లేని తలకాయను ఆ దుండగులు పెట్టారు. అయితే.. ఈ సంఘట న పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   మిస్టరీ గా మారిన జైహింద్ నాయక్ హత్య ఈ కేసును నరబలి కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.  దర్యాప్తు వేగవంతం అయినప్పటికీ... సస్పెన్స్ వీడటం లేదు.  రాచకొండ, నల్లగొండ  పోలీసుల ఉమ్మడి దర్యాప్తు చేస్తున్నారు.

రాచకొండ ఎస్వోటీ, నల్లగొండ సిసిఎస్ పోలీసులు కూడా ఈ కేసులో  రంగం లోకి దిగారు.  వారం రోజులు గడు స్తున్న దొరక ని నిందితుల ఆచూకీ లభ్యం కావడం లేదు. ఈ నెల పదిన సాగర్ హైవే మెట్టు మహంకాలి పాదాల వద్ద దొరికిన తల...  తల, మొండం వేరువేరు కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.  అయితే.. ఈ  హత్యకు నాలుగు రోజుల హైదరాబాద్ యంజాల్ లభించింది శిరస్సు లేని మొండెం.  నిర్మాణం లో ఉన్న ఇంటిపై లభించింది మొండం.  హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా  శూన్య పహాడ్ తండాకు చెందిన జైహింద్ నాయక్ గా పోలీసులు గుర్తించారు.  2018 ఇంటి యజమాని కేశవనాయక్ హత్యకు ఈ హత్యకు ఏమైన సంబందం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఇంటి యాజమానులతో పాటు పలువురు అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు.  సిసి కామెరా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కొనసాగుతుంది విచారణ. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. తర్వలోనే వివరాలు బయటపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: