షాకింగ్ : నల్గొండలో నరబలి?

praveen
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యం లో దేశం మొత్తం ఆ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమం లోనే టెక్నాలజీకి అనుగుణం గానే మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా నాగరిక సమాజం లోనే బ్రతుకుతున్నారు. ఒకప్పటి మూఢ నమ్మకాలను ఆచారాలను  ఎవరూ అంతగా పట్టించు కోవడం లేదు. మోడ్రన్ లైఫ్  స్టైల్ లోనే జీవితం సాగిస్తున్నారు. ముఖ్యం గా వింతైన మూఢ నమ్మకాలతో ఎవరు ప్రాణాల మీదికి తెచ్చు కోవడం లేదు అన్నది అర్ధమవుతుంది.

 అయితే ఇలా దేశం మొత్తం టెక్నోలజీ వెంట పరుగులు పెడుతుంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం అనాగరికత వైపు అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. ఇంకా మూఢ నమ్మకాలు పేరుతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యం గా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్న నానుడికి ఇంకా నమ్ముతున్నారు ఎంతో మంది. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ అనుమానం తో దారుణం గా దాడి చేసి ఎంతో మందిని పొట్టన బెట్టుకున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అంతేకాదు నిధుల కోసం నరబలులు కూడా సిద్ధమవుతున్నారు నేటి ఆధునిక సమాజంలో.

 ఇటీవలే తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా విరాట్ నగర్ లోని మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తలను స్థానికులు గుర్తించారు ఇది కాస్తా ఒక్కసారిగా అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హతమార్చి మొండెం లేని తలను గుడి ముందు వదిలి వెళ్లినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక రుద్ర పూజలు నెపంతో నరబలి ఇచ్చి ఉంటారు అని మరికొంతమంది అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: