మరో మహిళతో భర్త ఎఫైర్.. భార్య ఏం చేసిందంటే?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం విలువలు పూర్తిగా చచ్చి పోతున్నాయి. బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు ఎవరు. ఈ క్రమంలోనే ఎంతో మంది భార్యాభర్తలు సైతం క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడుతూ సొంత కాపురంలో చిచ్చు పెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. వివాహేతర సంబంధం ఒక ప్రాణం పోవడానికి కారణమైంది.


 మహబూబ్నగర్ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన  తాయప్ప, గోపమ్మ భార్య భర్తలు నివసిస్తున్నారు.. అయితే కొన్ని వేల వరకు ఎంతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలహాలు మొదలయ్యాయి. భార్య భర్తలు ఇద్దరు ఏదో ఒక విషయంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఇదే సమయంలో భార్య దగ్గర సుఖం దొరకడం లేదు అని భావించిన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధానికి తెరలేపాడు.  కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేశాడు తాపయ్య.


 ఏదో చుట్టాలింటికి వచ్చినట్లుగా అప్పుడప్పుడు కట్టుకున్న భార్య దగ్గరికి వస్తూ ఉండేవాడు. అయితే భార్య గోపమ్మ పిల్లలను చూసుకుంటూ అత్తమామల వద్ద ఉంటుంది.. అయితే భర్త తనను పట్టించుకోవడం లేదని ఇక పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారుతుంది అని మనస్తాపం చెందింది గోపమ్మ. ఈ నెల 27వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగిన విషయాన్ని అత్తమామలు గోపమ్మ తల్లి గారి కుటుంబానికి ఫోన్లో సమాచారం అందించడంతో ఇక వెంటనే వారు వచ్చి ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు భర్త కుటుంబసభ్యులను బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: