దారుణం : మతిస్థిమితం లేని బాలిక.. వివస్త్రగా ఉండడంతో?

praveen
మానవత్వం మరచి పోతున్న మనిషి.. మానవతా విలువలను నేల రాస్తున్న మనిషి.. మానవ బంధాలకు విలువ ఇవ్వని మనిషి.. అడవిలో బ్రతికే మృగం కంటే ప్రమాదకరంగా మారిపోతున్నాడు. మానవత్వం తో మెలగటం  కామంతో ఊగిపోతున్నాడు. చివరికి కంటికి కనిపించిన ఆడపిల్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలా  నేటి రోజుల్లో మానవ మృగాలుగా మారిపోతున్న ఎంతోమంది ఆడపిల్లలపై అత్యాచారం చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యకు సైతం పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.


 మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు మహిళలకు రక్షణ కల్పించ లేకపోతున్నాయి అన్నది ప్రస్తుతం అందరికీ తెలిసిన నిజం. ఇక్కడ ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితంలేని బాలికపై విషయంలో జాలి చూపించాల్సింది పోయి కామంతో ఊగిపోయాడు. అభం శుభం తెలియని బాలికపై  చివరికి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఒడిశాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాయగడ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నమత గ్రామంలో భగీరథి నచక అనే మహిళ 13 ఏళ్ళ దివ్యాంగ బాలికను ఇంటి దగ్గర వుంచి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో ఉండే కొంత మంది కామాంధులు ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గ్రహించి మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు


 అయితే ఈ దాడిలో బాలిక స్పృహ కోల్పోయింది. ఇక సాయంత్రం అడవి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూతురు వివస్త్రగా  ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మతిస్థిమితం లేదు కదా తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయని అనుకున్నారు. కానీ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో  దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా చివరికి పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు. దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: