జవాన్ గొంతు కోసిన జనం.. ఎందుకో తెలుసా?
ఇటీవలే నాగాలాండ్ లో వెలుగులోకి వచ్చిన కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. బయటికి వస్తున్న నిజాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఇటీవలే కాల్పులు సంచలనం సృష్టించాయి. తిరు - ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డుపై వెళ్తున్న వాహనంలో ఒక పరికరాన్ని గమనించారు సైనికులు.
ఇక ఈ పరికరాన్ని చూసి సైనికులు పొర పాటు పడటమే దారుణం ఘటనకు దారి తీసింది. వాహనంలో ఉన్న పరికరం వేటకు ఉపయోగించే రైఫిల్ గా సైనికులు భావించారు. ఈ క్రమంలోనే ఇక వాహనంలో రైఫిల్ ఉన్నట్లు సైనికులు భావించగానే కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే తుపాకీ శబ్దం విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సైనికుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడి ప్రజలందరూ ఇక సైనికులపై కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా ఒక సైనికుడి గొంతు కోసి చంపారు అన్న విషయాన్ని ఇటీవలే ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.