భార్య కాపురానికి రావాలని క్షుద్రపూజలు.. చివరికి?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే కొంతమంది జనాలు మాత్రం మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకాదయ్యాలు భూతాలు ఉన్నాయి అంటూ నమ్ముతూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న విషయాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు.

 బురిడి బాబా ల చేతిలో మోస  పోతూన్న జనాలు కొంత మంది అయితే.. క్షుద్రపూజలతో ఏదో జరిగిపోతుంది అని నమ్మేవాళ్ళు మరికొంతమంది.. క్షుద్ర పూజలు చేస్తే తన మీద అలిగి పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వస్తుంది అని నమ్మాడు ఒక భర్త. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. పట్టణంలోని శేఖరం బంజర కు చెందిన ఓ కారు డ్రైవర్ కు కొమ్ము గూడెంకు చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానలేమి ఆర్థిక ఇబ్బందుల కారణం గా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి

 ఈ క్రమం లోనే పని నిమిత్తం భర్త ఐదు నెలల పాటు వేరే రాష్ట్రానికి వెళ్ళాడు. ఆ సమయం లో భార్య పుట్టింటికి వెళ్లి పోయింది.. ఇక భర్త ఇంటికి తిరిగి వచ్చాక కాపురానికి రావాలంటే ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించ  లేదు. అయితే క్షుద్ర పూజలు చేస్తే భార్య తిరిగి వస్తుందని. ఒక స్నేహితుడు చెప్పడం తో భర్త 30 వేల తో ఏకం గా పూజలు చేయించాడు. రోజుల తర్వాత భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిన తంతు గురించి తెలుసుకున్న భార్య తరపు బంధువులు  అతనికి దేహశుద్ధి చేశారు. ఇక భార్యా భర్తలిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: