దారుణం: యువకుడు దారుణ హత్య.. ఎందుకంటే..??
అంతేకాదు.. నిందితులు బిజేంద్రను ఎంతో క్రూరంగా వ్యవహరించారని గాయాలకు సంబంధించిన గుర్తులను చుస్తే అర్ధం అవుతుందని అన్నారు. ఇక మృతుడి జననాంగాలపై లోతైన గాయం, పేగు కూడా పొడుచుకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నిందితులు బాధితుడిని గాయపరిచి అతడిని గోహనా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బిజేంద్ర ఆసుపత్రికి వెళ్లే లోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉంటె.. మృతుడు బిజేంద్ర ఇంటి నుంచి పారిపోయి తన ప్రియురాలితో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని నిందితులు ఆరో[ఆరోపణలు చేస్తున్నారు.
బిజేంద్ర ప్రేమించిన అమ్మాయి షమ్రీ గ్రామానికి చెందిన ఆమె. అతడు గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సోషల్ మీడియా ద్వారా ఆ యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోగా దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపలేదు. దీంతో వారు ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేసి ఆసుపత్రిలో విడిపెట్టి వెళ్లారు. విషయం తెలుసుకున్న బిజేంద్ర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురైయారు. వారు ఆసుపత్రికి వెళ్లే లోపే బిజేంద్ర మృతి చెందారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.