పేరెంట్స్ జాగ్రత్త.. చిన్న పాటి నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది?
ఈ విషాదకర ఘటన స్థానికంగా అందరినీ కంటనీరు తెప్పించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు ఆడుకుంటుంది కదా అని తల్లి తన పనిలో నిమగ్నమై ఉంది. కానీ తల్లి చిన్నపాటి నిర్లక్ష్యమే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురుని దూరం చేసింది. నీటి బకెట్ వద్దకు వెళ్లిన ఆ చిన్నారి అందులో అందులో జారి పడింది. ఇక ఎవరు గమనించక పోవడంతో చివరికి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. శ్రీనివాస్, సోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అయితే ఇటీవలే శ్రీనివాస్ కుమారుడిని తీసుకొని దుకాణం వద్దకు వెళ్లగా.. సోనీ కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే 18 నెలల కుమార్తె ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. తల్లి తన పనిలో నిమగ్నమైంది. కాసేపటికి కూతురు అలికిడి లేక పోవడంతో కంగారుపడిన తల్లి ఏం జరిగిందని ఇల్లంతా వెతికింది. ఈ క్రమంలోనే స్నానాల గదిలోకి వెళ్లి చూసింది. ఇంతలో ఇక 18 నెలల కూతురు నీటి బకెట్లో తలకిందులుగా పడి ఉంది. దీంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. వెంటనే కూతురిని రెండు చేతుల్లో పట్టుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అక్కడినుంచి ఆంబులెన్స్ లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.