పేమించి పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త...భర్తకు షాకిచ్చిన భార్య !!!
వివరాలలోకి వెళితే ..విశాఖ జిల్లా మకరవరపాలెం మండలం లోని పైడి పాల గ్రామానికి చెందిన ఉద్యోగస్తుడు నాగేంద్ర ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. సాయి అనే యువతిని నాగేంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి చేసుకున్నప్పటినుండి సాయి తో నాగేంద్ర కాపురం చేయడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యం లో తన అత్తవారికి ఈ విషయాన్ని తెలుపగా వారుకూడా ఆ యువతిని మెడపట్టి గెంటేశారు. దిక్కు తోచని స్థితిలో సాయి తన తల్లి తో కలసి నాగేంద్ర ఇంటి ముందు టెంట్ వేసి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తోంది . తనని కాపురానికి రానివ్వకపోతే తనకు చావే శరణ్యం అంటోంది బాధితురాలు సాయి. బాధితురాలు ఇప్పటికే మాకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి న్యాయం చేయవలసిందిగా పొలిసు అధికారులను కోరింది. ఆమె మామ తనని నిర్లక్ష్యంగా మెడ పట్టి గెంటేశారని , తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరింది.