భర్తపై అలిగి క్షణికావేశం లో భార్య ఆత్మా హత్య !!!

Surya
దశరపండగ ఆంటే ప్రతి ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కానీ ఓ ఇంట్లో పండగ పూత విషాదం నెలకొంది . పండగ పూట భర్త తో గొడవ పడిన ఇల్లాలు పొలానికి వెళ్లి పురుగులమందు తగిన చనిపోయిన ఘటన నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు మండలం మేడిగడ్డలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే మేడిగడ్డ గ్రామానికి చెందిన వడ్త్యావత్‌ మౌనిక (20) అనే యువతీ అదే గ్రామానికి చెందిన తన మేనమామ కుమారుడు అనిల్‌ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. పెళ్లి చేసుకుని ఆరునెలలు ఎంతో అన్యోన్యంగా జీవించారు. తాజాగా దసరా పండుగ సందర్భం గా మౌనికను ఆమె తల్లిగారి ఇంటికి పంపాడు భర్త. స్వతహాగా డిసిఎం డ్రైవర్ అయినటువంటి ఆమె భర్త అనిల్‌ జీవనాదారం కోసం ఓ కిరాయి రాగా ప్రక్కనున్న వేరే ఊరు వెళ్ళాడు. మౌనిక పండగకు రావాల్సింది గా ఫోన్ ద్వారా అడిగింది. కానీ ఆమె భర్త కిరాయి రావడంతో వేరేఊరు వచ్చాను రావడం కుదరదని చెప్పాడు కానీ మారం చేసిన మౌనిక చివరకు తాను రాకపోతే పురుగులమందు తగి చనిపోతానని చెప్పింది . 


లైట్ తీసుకున్న ఆమె భర్త రానని చెప్పి అర్ధం చేసుకోమన్నాడు. కానీ తప్పుగా అర్ధం చేసుకున్న మౌనిక వెంటనే తన తండ్రి పొలం లో కి వెళ్లి అక్కడ ఉన్న పురుగుల మందును తాగి చనిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను కల్వకుర్తి గవర్నమెంట్‌ హాస్పిటల్‌ లో చేర్చారు. ఆమెను డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు . ఈ ఘటన తో మౌనిక తల్లి తండ్రులు ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విల పిసరున్నారు. క్షణికావేశం మనిషిని ఎంతవరకైనా తీసుకెళుతుంది కాబట్టి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకునే ముందు వారిపై ప్రేమను పెంచుకున్న ఆత్మీయుల కోసం ఆలోచిస్తే ఇలాంటి దారుణాలు జరగవని పెద్దలు మరియు ఆమె శ్రేయోభిలాషులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: