ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ.. కానీ అంతలోనే?

praveen
ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు మన దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న ఆ చట్టాలు మాత్రం నేరస్తులకు చుట్టాలు గానే మారిపోతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులు ఏదో ఒక విధంగా బయటికి వస్తూ సభ్యసమాజంలో తిరుగుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు పోలీసులు అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికీ కామాంధుల లో మాత్రం ఎక్కడ భయం కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు పెరిగిపోతూనే ఉన్నాయి.

 దీంతో ఆడపిల్ల గడప దాటి కాలు బయట పెట్టాలంటేనే భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలలు నిండని పసిపాప నుంచి నూరేళ్ళు నిండిన ముసలోళ్ల వరకు కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. ఇక ఇటీవల కాలంలో అయితే దేశంలో ఎక్కడో ఓ చోట తరచూ ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు పరాయివాళ్ళు నుంచి మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటే.. ఇక ఇప్పుడు మాత్రం సొంత వారు కూడా మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక ఇటీవలే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.

 ఓ మహిళను పలువురు దుండగులు ఆటోలో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు నగదును ఎత్తుకెళ్లారు. చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహిళా ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో మద్యం సేవించిన ముగ్గురు లిఫ్ట్ ఇస్తాము అంటూ మాటలు కలిపారు. ఇక ఆమె ఆటో ఎక్కగానే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి ఇక మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కెళ్లారు. బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: