వామ్మో.. హోంమంత్రి ఇలాకలో మరో మారుతీరావు?

praveen
ప్రస్తుతం అందరూ నాగరికత వైపు పరుగులు పెడుతుంటే ఇంకా కులం మతం అంటూ ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్నారు.  చాలామందిలో ఇంకా కుల పిచ్చి పేరుకుపోయింది అనే దానికి ఎన్నో ఘటనలు నిదర్శనం గా మారిపోతున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రేమికులకు కులం అనేది ఒక పెద్ద శాపంగా మారిపోతుంది. రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమ కులం అడ్డుగా మారిపోతుంది. దీంతో కన్న పేగు బంధాన్ని కూడా మరిచి దారుణాలకు పాల్పడేందుకు కూడా వెనకాడటం లేదు. ఇక ఇటీవల కాలంలో ఎన్నో పరువు హత్యలు వెలుగులోకి వస్తున్నాయ్.

అయితే గతంలో తెలంగాణలో మారుతి రావు అనె వ్యక్తి  తన కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనే కారణంతో ఏకంగా కిరాయి మనుషులను పెట్టి చంపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఇక ఎంతో మంది యువత కూడా ఈ పరువు హత్య ను తీవ్రంగా వ్యతిరేకించారు.  ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక పరువు హత్య జరిగింది.  అది కూడా ఏకంగా హోం మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి పరువు హత్య జరగడం సంచలనంగా మారిపోయింది.

 గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లిపాడు కు చెందిన బండారు గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నాడు గోపి. ఇటీవలే ఈ విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఈ క్రమంలోనే గోపీని పలుమార్లు మందలించారు. కానీ ప్రియుడిని వదులుకో లేక పోయినా యువతి ఏకంగా తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని సహించలేకపోయారు యువతీ కుటుంబ సభ్యులు. దీంతో కిరాయి ముఠాతో యువకుడు గోపి ని దారుణంగా హత్య చేయించాడు అమ్మాయి తండ్రి. కొడుకు కనిపించడం లేదు అంటూ గోపి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. గోపి హత్యకు గురైనట్లు తేలింది ఇక నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: